చంద్రబాబుని ఫిదా చేసిన అమరావతి వాసులు

నాయకుడు అనేవాడు ప్రజల మనసులో స్థానాన్ని సంపాదించుకుంటే ఎలా ఉంటుందో అమరావతి వాసులు తెలియజేసారు  సేమ్ సినిమా మాదిరిగానే, అంతకుమించి అన్నట్టు పూల వర్షం కురిపించారు అమరావతి రైతులు.సచివాలయానికి తొలిసారిగా విచ్చేసి బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు అమరావతి రైతులు. దారి పొడవునా పూలు చల్లి.. అతడిపై పుష్ప వర్షం కురిపించారు. సినిమా షూటింగ్ మాదిరిగా అక్కడ పరిస్థితిని చూసి చంద్రబాబు ఫిదా అయ్యారు. అయితే అమరావతి రైతులను క్యారెక్టర్ ఆర్టిస్టులతో పోల్చిన సంగతి తెలిసిందే. కానీ వారికి మించి తమలో ఉన్న ఆనందాన్ని, ఆర్ద్రతను చంద్రబాబుపై చూపించారు అమరావతి రైతులు.అమరావతి రైతుల ఆత్మీయ స్వాగతానికి చంద్రబాబు ముగ్ధుడయ్యారు. ముకిళిత హస్తాలతో అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. మందడం గ్రామం మీదుగా వెళ్లే సమయంలో రైతులు ‘ న్యాయస్థానం నుంచి దేవస్థానం’కార్యక్రమం చేపట్టిన రథంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి ఇంటి వద్ద నుంచి రాజధాని ఎక్స్ప్రెస్ మీదుగా వెలగపూడి లోని సచివాలయం వరకు ఎటు చూసినా రహదారులను రంగురంగుల పువ్వులతో నింపేశారు. వెజినరీ డైనమిక్ లీడర్ అంటూ అభినందిస్తూ వాహనాల్లో తీసుకొచ్చిన టన్నులకొద్ది పూలను చంద్రబాబు ముందు విరజిమ్ముతూ ఘన స్వాగతం పలికారు. దివ్యాంగులు సైతం భూత కర్రల సాయంతో నిల్చొని స్వాగతం పలికారు.చంద్రబాబు సీఎం కావడంతో అమరావతికి కొత్త కళ వచ్చింది. జూన్ 4న ఫలితాలు వచ్చిన తర్వాత అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ ప్రారంభం అయ్యింది. దాదాపు 100 జెసిబి లతో ముళ్లపొదలను తొలగించారు. పిచ్చి మొక్కలను పూర్తిగా తొలగింప చేశారు. అమరావతి రైతుల్లో ఒక రకమైన ఆనందం వెల్లివిరిసింది. భవిష్యత్తుపై భరోసా కనిపించింది. జూన్ 4న ఫలితాలు వచ్చింది మొదలు.. జూన్ 12న ప్రమాణస్వీకారం.. ఇలా అన్నింటిని ఒక వేడుకలా జరుపుకున్నారు. తమ అభిమాన నాయకుడు, కలల సాధకుడు చంద్రబాబుకు సినిమా షూటింగులకు మించి ఆత్మీయ స్వాగతం పలికారు. సినిమాలకు తలదన్నే రీతిలో టన్నుల కొద్ది పూలను తెప్పించి.. చంద్రబాబు పై పూల వర్షం కురిపించారు. అంతటి అభిమానంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు చంద్రబాబు. ఫిదా అయిపోయారు.