మెగాస్టార్ చిరంజీవికి రోజా రమణి దంపతుల శుభాకాంక్షలు


ఇటీవలే కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పురస్కారాన్ని ప్రకటించినప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇప్పటికే సినీ, మీడియా రంగాల వారు మాత్రమే కాకుండా చిరంజీవిని అభిమానించేవారు, ఆయన శ్రేయోభిలాషులు అంటే దాదాపు అన్ని రంగాల వారు ఇంటికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో నటి రోజా రమణి, ఆమె భర్త నటుడు చక్రపాణి అలాగే టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ కలిసి పుష్ప గుచ్చాన్ని అందించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.