అయోధ్యలో రామయ్యకి తిరుమల శ్రీవారి లక్ష లడ్డులు

భారతీయుల కల నెరవేరితున్న క్షణాలు  అయోధ్యలో రామ నామ జపంతో భారత దేశం అంతా మారు మోగుతోంది. ఎటు చూసినా అయోధ్య రామ మందిరంపైనే చర్చ సాగుతూ వస్తుంది. అయోధ్య రామ మందిరా నిర్మాణం ఎలా చేస్తున్నారు. రామ మందిరంలో ఎలాంటి ప్రసాదాలు వితరణ చేయనున్నారు. వచ్చే యాత్రికులకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాత్రీకుల సముదాయాలపై అనేక చర్చ సాగుతుంది.

1048-entry-1-1705679213.jpg

ఇక అన్నిటిలోనూ ప్రత్యేక ఆకర్షణగా తిరుమల లడ్డూ నిలుస్తున్నాయి. దాదాపు లక్ష లడ్డూలను టీటీడీ శ్రీ రామ జన్మభూమికి తరలిస్తుంది టీటీడీ అయోధ్య శ్రీ రామచంద్రమూర్తి మందిరానికి అనేక విరాళాలు అందుతూ వస్తున్నాయి. ఇక నుంచి ప్రతి ఒక్కటి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా సేకరించిన డొనేషన్ ద్వారా నిర్మాణం చేపట్టారు. అయితే శ్రీ రామ చంద్రమూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన రోజు ప్రత్యేక ప్రసాదంగా శ్రీవారి లడ్డూలను నివేదించనున్నారు