శ్రీ శైలం వెళ్ళేభక్తులకు ఇది శుభవార్తే

శ్రీశైలం వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ఆర్ధికంగా వెనుకబడిన భక్తుల కోసం ఉచిత సామూహిక సేవలు ప్రారంభించింది. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న సామాన్య భక్తులకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. తెల్లరేషన్‌ కార్డు ఉన్న భక్తులు నెలలో ఒకరోజు ఉచిత సామూహిక సేవ చేసే అవకాశాన్ని తీసుకొచ్చింది. ఆరుద్రోత్సవం సందర్భంగా తెల్లరేషన్ కార్డు భక్తులకు ఉచిత సామూహికసేవగా శ్రీస్వామిఅమ్మవారి కళ్యాణం నిర్వహించారు. చంద్రవతి కళ్యాణ మండపంలో శ్రీస్వామి అమ్మవారి కల్యాణానికి 250 మంది తెల్లరేషన్ కార్డు భక్తులు పాల్గొన్నారు.

కళ్యాణం అనంతరం భక్తులను శ్రీస్వామి అమ్మవారి దర్శనానికి అనుమతించారు దేవస్థానం అధికారులు.. శ్రీశైలం క్షేత్రం నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది.. కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో మల్లన్న దర్శనానికి తరలివస్తుంటారు భక్తులు. తెల్ల రేషన్‌ కార్డు ఉన్న భక్తులకు శ్రీశైలం మల్లన్న ఆలయం అధికారులు ఈ శుభవార్త చెప్పారు. శ్రీశైలంలో ఉచిత సామూహిక సేవలో పాల్గొనాలి అనుకునేవారు.. www.srishailadevastanam.org వెబ్‌సైట్‌లో ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సేవలో దంపతులు లేదా ఒక్కరు పాల్గొనే అవకాశం ఉంటుంది.. ఈ సేవలను యూట్యూబ్‌లో ఆలయానికి సంబంధించిన శ్రీశైల టీవీ ద్వారా భక్తులు వీక్షించొచ్చని తెలిపారు.

అంతేకాదు శ్రీశైలం ఆలయంలో ఈ ఉచిత సామూహిక సేవలను ఆయా మాసాలకు ఉన్న విశిష్టత ప్రకారం నిర్వహిస్తారని తెలిపారు. ఈ సేవలు 2024 ఫిబ్రవరి 16 వరకు ప్రతి నెలలో ఒక రోజును ఎంపిక చేస్తారు.. ఈ ఉచిత టికెట్ ప్రతి మాసంలో 250మందికి మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. భక్తులకు కచ్చితంగా తెల్లరేషన్‌కార్డు ఉండాల్సిందే. అర్హత ఉన్న భక్తులు తెల్లరేషన్‌ కార్డును స్కాన్‌ చేసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.శ్రీ శైలం వెళ్ళేభక్తులకు ఇది శుభవార్తే 

అభిషేకం తర్వాత భక్తులు స్పెషల్ క్యూ లైన్‌లో స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనంతో పాటూ వృద్ధ మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సేవలో పాల్గొన్నవారికి రెండు లడ్డూ ప్రసాదాలు, విభూది, కైలాస కంకణాలు, కుంకుమ, శ్రీశైల ప్రభ, రవిక వస్త్రం, కాటన్‌ కండువాలను అందజేస్తారు. స్వామివారి దర్శనం అనంతరం దేవస్థానం అన్నపూర్ణ భవన్‌లో భోజన సదుపాయం కూడా ఏర్పాటుచేశారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు ఆలయ అధికారులు.