వైభవోపేతంగా పూరీ జగన్నాథుడి రథయాత్ర: లక్షలాదిగా పాల్గొన్న భక్తులు

భువనేశ్వర్: ప్రఖ్యాత పూరీ జగన్నాథుని రథయాత్ర మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. జగన్నాథుడి రథయాత్రను చూసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. విదేశాల నుంచి కూడా అనేక మంది పూరీకి చేరుకున్నారు. పూరీ రథయాత్ర జరిగే వీధులన్నీ ఇసుకేస్తే రాలనంతా భక్తజనంతో కిక్కిరిసిపోయాయి. జై జగన్నాథ్ అంటూ భక్తులు పరవశించిపోయారు. పూరీ వీధులన్నీ జగన్నాథుడి నినాదాలతో మార్మోగుతున్నాయి.