ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్‌ డైరెక్టర్ గా "సూరిశెట్టి జయకృష్ణ"

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పద్మశాలి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌లో పిఠాపురం నియోజకవర్గానికి ప్రాధాన్యతను కల్పించింది కూటమి ప్రభుత్వం,టీడీపీ,జనసేన బీజేపీ పర్సెంటేజ్ ల ఆధారంగా వివిధ వర్గాల నాయకులు  అవకాశాలు దక్కించుకున్నారు

ఇందులో భాగంగా పిఠాపురం నియోజక వర్గం ,గొల్లప్రోలు మండలం , చేబ్రోలుకు చెందిన సూరిశెట్టి జయ నాగకృష్ణ (జనసేన) నాయకులను డైరెక్టర్లుగా నియమించారు , జయనాగ కృష్ణ జనసేన ఆవిర్భావం నుంచి,వివిధ సహాయ కార్యక్రమాలు ,జనసేన పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాలుపంచుకుంటూ జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శిగా ఉన్నారు కొనసాగుతున్నారు,

ఈ సందర్బంగా జయకృష్ణ మాట్లాడుతూ,ఇది నియోజకవర్గ ప్రజల సహాయసహకారాలతో లభించిన పదవి అని దీనిని నేను పదవిగా భావించకుండా ఒక బాధ్యతగా చూస్తానని దీని ద్వారా ప్రజలకు మరింత సేవ చేసి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని చెప్పుకొచ్చారు   సందర్భంగా నాయకులు,కార్యకర్తలు ,ప్రజలు హర్షం వ్యక్తం చేశారు