చంద్రబాబు కుప్పం పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం (జూన్ 25) నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి కుప్పం చేరుకుంటారు.  

హంద్రీ-నీవా కాలువను పరిశీలించిన అనంతరం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అలాగే సాయంత్రం ఆర్ అండ్ బీ భవనంలో పార్టీ నేతలతో చంద్రబాబు చంద్రబాబు భేటీ అవుతారు. ఇక బుధవారం (జూన్ 26) కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు.  

మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం డిగ్రీ కళాశాలలో అధికారులతో   సమీక్ష  నిర్వహిస్తారు. అనంతరం  పీఈఎస్ ఆడిటోరియంలో పార్టీ శ్రేణులతో చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం సాయంత్రం హెలికాప్టర్ లో అమరావతి చేరుకుంటారు.