హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో టీడీపీ NRI నేత యశ్ అరెస్ట్

టీడీపీ ఎన్‌ఆర్ఐ నేత యశ్ బొద్దులూరిని సీఐడీ పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అమెరికా నుంచి వచ్చిన కొద్దిసేపటికే అరెస్ట్ చేసి మంగళగిరి తరలించారు. అతడిపై లుకౌట్ నోటీసులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అరెస్ట్‌పై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అస్వస్థతకు గురైన తల్లిని చూసేందుకు అమెరికా నుంచి వచ్చిన యశ్ శంషాబాద్ లో ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ అక్రమ అరెస్టుని ఖండిస్తోంద్నారు.. మరో వంద రోజుల్లో అట్టుకి, అట్టున్నర తిరిగి ఇచ్చేస్తామన్నారు.యశ్ అరెస్ట్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఎన్‌ఆర్ఐ యశ్ బొద్దులూరిని హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో అక్రమ కేసుల్లో అన్యాయంగా అరెస్ట్ చేయడం గురించి తెలిసి షాకయ్యానన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి నోరు నొక్కాలని చూస్తున్నారన్నారు. ఓ టెర్రరిస్టులా అతడ్ని విదేశాల నుంచి వచ్చీ రాగానే అరెస్ట్ చేయడం దారుణమన్నారు. అతడికి న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదన్నారు. వైఎస్సార్‌సీపీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు.యశ్ అరెస్ట్‌పై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. 'న్యాయమూర్తులను అసభ్య పదజాలంతో దూషించే వైసీపీ నేతలకు పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తూ.. ప్రజాసమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలను మాత్రం వేధింపులకు గురిచేయడం దుర్మార్గం. రాష్ట్ర అభివృద్ధికి సహకరించే ఎన్ఆర్ఐ లు అంటే జగన్ రెడ్డికి గిట్టదని మరోసారి బట్టబయలైంది. యాష్ పొద్దులూరి అరెస్ట్ అప్రజాస్వామికం. అక్రమ నిర్బంధాలతో ప్రజల గొంతు నొక్కే కుట్రకు జగన్ రెడ్డి తెరలేపారు. ఓటమి భయంతోనే ఇటువంటి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు. విదేశాల్లో ఉంటూ కూడా కన్నభూమిపై మమకారంతో ప్రజాసమస్యలపై నిర్భయంగా స్పందించే ఎన్ఆర్ఐ యశ్‌ను అరెస్ట్ చేయడం ప్రభుత్వ సైకో చర్యలకు అద్దం పడుతోంది. అనారోగ్యంతో ఉన్న తల్లిని పరామర్శించడం నేరమా?.. ఎయిర్‌పోర్టులో దిగగానే అక్రమంగా అరెస్ట్ చేశారు. యశ్ భద్రతపై ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు జగన్ మోహన్ రెడ్డి తీరును ఖండించాలి'