హైకోర్టుని ఆశ్రయించిన అల్లు అర్జున్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీ ఎన్నికల సమయంలో నంద్యాలలో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ బన్నీ పిటిషన్‌ వేశాడు. ఆయన పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. రేపు విచారణకు వచ్చే అవకాశముంది.ఏపీ ఎన్నికల సమయంలో తన మిత్రుడు, నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని అల్లు అర్జున్ ఆయన ఇంటికి వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. అయితే అప్పుడు సెక్షన్‌ 144, పోలీసు 30 యాక్టు అమల్లో ఉన్నప్పటికీ  ఎలాంటి అనుమతి తీసుకోకుండా బన్నీ పర్యటించాడు. ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా గుమికూడారు. ఇది ఎన్నికల ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫిర్యాదు అందడంతో.. అల్లు అర్జున్‌ తో పాటు శిల్పా రవిపై అప్పుడు నంద్యాల టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ తాజాగా బన్నీ పిటిషన్‌ వేశాడు.