పిఠాపురం నియోజక వర్గం లో, జనసేన పార్టీ ప్రధాన కార్య దర్శి నాగబాబు పర్యటన

పిఠాపురం నియోజక వర్గం లో జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారు గెలుపు తరువాత, నాగబాబు గారు గత రెండు రోజులుగా నియోజకవర్గం లో  పర్యటిస్తూ,  చెయ్యాలిసిన అభివృద్ధి  కార్యక్రమాలు ,వాటికి అనుగుణంగా కార్యాచరణలు రూపొందించాలని, లోకల్ నాయకులకు దిశా నిర్ధేశం చేశారు.  అందులో భాగంగా ఈ రోజు పిఠాపురం లో శ్రీ వీరభద్ర మోడరన్ రైస్ మిల్లులో ఏర్పాటు చేసిన జనసేన నాయకుల సమావేశం లో పాల్గొని పిఠాపురం నియోజకవర్గం లో సమస్యలపై ద్రుష్టి పెట్టాలని ,నాయకులందరూ టీమ్ వర్క్ చేస్తూ మిగిలిన నియోకవర్గాలకు ఆదర్శంగా నిలవాలని,అలాగే నియోజక వర్గ అభివృద్ధికి కావలిసిన నిధులు ,కార్యాచరణ ఉప ముఖ్యమంత్రిగారు దృష్టికి తీసుకుని వెళ్లాలని నాయకులకు తెలియచేశారు ఈ కార్యక్రమంలో చల్లా  చినబాబు మాధురి నాయుడు,బస చిట్టిబాబు,మామిడాల సూరిబాబు,,బస రాజా,గున్నబత్తుల రాంబాబు, కందా కిరణ్,మొగిలి రాజా,మద్దల సతీష్ తదితరులు పాల్గొన్నారు