తిరుమల వేంకన్న దర్శనానికి 10 గంటలు
తిరుమలలో భక్తుల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. గురువారం (నవంబర్ 28) ఉదయం శ్రీవారి దర్శనానికి భక్తులు మూడు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పది గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం (నవంబర్ 27) శ్రీవారిని మొత్తం 67 వేల 626 మంది దర్శించుకున్నారు. వారిలో 22 వేల 231 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హఉండీ కానుకల ఆదాయం 3 కోట్ల 75 లక్షల రూపాయలు వచ్చింది.
Comments
0 comment