అమెరికా టెక్సాస్ నగరవాసులని కట్టి పడేసిన ప్రవాసభారతీయుల అయ్యప్ప పడిపూజ

స్వామియే శరణం అయ్యప్ప అంటూ భారతదేశం నలుమూలల నుండి స్వామి అయ్యప్ప భక్తులు శబరిమల చేసురుకుంటున్నారు ,మన భారతదేశం లో ఎక్కడినుండి అయినా శబరిమల చేరుకోవడానికి ఇండియన్ రైల్వే ప్రత్యేకమైన ఏర్పాట్లని కూడా చేసింది, కానీ మన భారతీలు ఎక్కడ వున్నా మన సనాయాతన ధర్మ మూలలను మరిచిపోకుండా ఆధ్యాత్మిక పరిమాళాలను ఖండ ఖండాన్తరాలలో వెదజల్లుతున్నారు అనడం లో అతిశయోక్తి లేదు ,ఈనెల 25 వతేదీనా అమెరికా టెక్సాస్ నగరం లో ప్రవాస భారతీయులు సుమారు 40 మంది అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాలధారణ దీక్ష ,చేసిన  పడిపూజా విధానం అక్కడ నగరవాసులని కట్టిపడేసింది ,భారత దేశం లో స్వాములు చేసే విధంగా,అద్భుతంగా టెక్సాస్ నగరం లో ప్రవాసభారతీయులు చెయ్యడం తో  టెక్సాస్ నగరవాసులు భక్తి పారవస్యులయ్యారు,ఎంతో మంది నగర వాసులు ఆ పడి  పూజా విధానాన్ని చూసి భక్తి తో పరవశించి పోయారు ,   అందులోను ఈ సంవత్సరం శబరిమల వచ్చే భక్తులు ఎన్నడూ లేనంతగా పెరిగిపోయారు అని,అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి రోజుల తరబడి వేచిచూడాలిసివస్తుంది అని శబరిమల అయ్యప్ప దేవాలయం వారు తెలియజేసారు