ముమ్మిడి వరం నియోజక వర్గం ఎం.ఎల్.ఏ పొన్నాడా సతీష్ ఇంట్లో తీవ్ర విషాదం

అమెరికాలో నిన్న రాత్రి జరిగిన ప్రమాదం లో ముమ్మిడి వరం నియోజక వర్గం ఎం.ఎల్.ఏ పొన్నాడ సతీష్ కుటుంబసభ్యులు మృతి చెందారు,ఈ ప్రమాదం లో సతీష్ చిన్నాన్న పొన్నాడ నాగేశ్వరావు ,భార్య సీతా మహాలక్ష్మి ,కుమార్తె నవీన గంగ ,మనుమడు,మనుమరాలు మృతి చెందారు ,అల్లుడు లోకేష్ కి తీవ్ర గాయాలయ్యాయి వీరు అమలాపురం వాసులుగా గుర్తించారు ,క్రిస్మస్ సందర్భంగా టెక్సాస్ నుంచి అట్లాంటా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను, క్షతగాత్రులను ఫోర్ట్‌వర్త్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరికి తానా ట్రెజరర్ కొల్లా అశోక్‌బాబు, ఫౌండేషన్ ట్రెజరర్ పోలవరపు శ్రీకాంత్ సంస్థ తరఫున అవసరమైన సాయాన్ని అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇపుడు ఈ యాక్సిడెంట్ కి సంబంధించిన విజువల్స్  సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి