బి ఆర్ ఎస్ నాయకుడైన కలిసిన బిగ్ బాస్

కెసిఆర్ ప్రమాదం బారిన పడినదగ్గరనుండి ,ఎందరో ప్రముఖులు యశోద హాస్పిటల్ కు క్యూ కట్టారు ,నిన్నటికి నిన్న కెసిఆర్ ని మాకు చూపించాలి అంటూ పాలమూరు ప్రజలు అందరు హాస్పిటల్ ముందు ధర్నాకు దిగటం పోలీసులు వాళ్ళకి సర్దిచెప్పడం తలకు మించిన భారం గా  మారింది,అందుకే నిన్న కెసిఆర్ తన మంచం మీదనుండే ఒక సందేశాన్ని మీడియాకు అందించారు ,ఎవరు తనను కలవడానికి రావొద్దు అని ,ఇలా రావడం వలన తనకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని డాక్టార్లు చెప్పారని ,నామీద ప్రేమ చూపిస్తున్న మీ అందరికి ధన్యవాదములు అని చెప్పుకొచ్చారు ,ఈరోజు సినీనటులు నాగార్జున కెసిఆర్ ని కలిసి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు ,అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు రేణుక చౌదరి కూడా ఆయనను పారామర్శించినవారిలో వున్నారు