బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీ...పోలీసులు గాలింపు ?

బిగ్ బాస్ తెలుగు 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విషయంలోకి వెళితే… డిసెంబర్ 17న అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ ఫినాలే ముగిసింది. పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య మొదటి నుండి సోషల్ మీడియాలో గొడవలు జరుగుతున్నాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అసభ్య పదజాలంతో తిడుతున్నారని అమర్ దీప్ తల్లి కొన్ని వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఫినాలే రోజు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ భారీగా అన్నపూర్ణ స్టూడియోకి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగాయి. కొట్టుకునే వరకు వెళ్ళింది. పరిస్థితి గమనించిన పోలీసులు పల్లవి ప్రశాంత్ ని బ్యాక్ డోర్ నుండి వెళ్లిపొమ్మన్నారు. బయట గొడవగా ఉంది. మీరు అన్నపూర్ణ స్టూడియో వద్దకు రావొద్దని గట్టిగా చెప్పారు . అయినా వినకుండా ప్రశాంత్ ఓపెన్ టాప్ కారులో అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు.దాంతో గొడవ మరింత పెద్దదైంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లను ధ్వంసం చేశారు. అంతటిలో ఆగలేదు.ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల మీద కూడా దాడి చేశారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశాడు. పల్లవి ప్రశాంత్ పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ప్రశాంత్ ని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న ప్రశాంత్ పరార్ అయ్యాడని సమాచారం.

పల్లవి ప్రశాంత్ బ్రదర్ పరుశురాములు కోసం ఒక టీమ్ సొంత ఊరికి పోయారు. కారు డ్రైవర్ సాయి కిరణ్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ కోసం మూడు బృందాలు వెతుకుతున్నాయి. ఫోన్ స్విచ్చాఫ్ చేసిన పల్లవి ప్రశాంత్ ఎక్కడున్నాడో తెలియలేదు. కొమురవెల్లి సమీపంలో ఉన్నాడని తెలిసి పోలీసులు అక్కడికి వెళ్లారు. ప్రశాంత్ అనుచరుల ఫోన్ డేటాను పోలీసులు పరిశీలిస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ తప్పదని అర్థం అవుతుంది.