ఎమోషన్ లో పాపం కౌశిక్ చిక్కులో పడ్డాడు

పాపం బి .ఆర్ .ఎస్  అభ్యర్థి  చిక్కుల్లో పడ్డారు ,భావోద్వేగం తో మాట్లాడి ఎన్నికల నియమావళి ఉల్లంఘించారు అని ఇప్పుడు ఎలక్షన్ కమీషన్ నివేదిక కోరింది ,అందుకే  బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కమలాపూర్ ఎంపీడీవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక అందించారు హుజూరాబాద్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్రకు కాదని, లేదంటే నాలుగో తేదీన మా ముగ్గురి శవయాత్రకు మీరు రావాల్సి ఉంటుందని, ఏ యాత్రకు వస్తారో మీరు నిర్ణయించుకోవాలని సూచించి కౌశిక్ రెడ్డి అన్నారు. విచారణ జరిపి నివేదిక అందించింది హుజూరాబాద్ ఎన్నికల అధికారిని ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కౌశిక్‌రెడ్డి నిన్న తన భార్య, జిల్లా కుమార్తెతో కలిసి హనుమకొండ కమలాపూర్‌లో రోడ్‌షో నిర్వహించారు.తనను గెలిపించుకుంటే కుటుంబమంతా కలిసి కమలాపూర్ బస్టాండ్‌లో ఊరేసుకుంటామని అన్నారు. తనకు ఓటేసి గెలిపించుకుంటే ముగ్గురు శవాలను చూడాల్సి వస్తోంది. ఓటేసి దీవిస్తే జైత్రయాత్రకు వస్తానని, లేదంటే 4న తన శవయాత్రకు రావాలని వ్యాఖ్యలు చేశారు.