ఎన్నికల వేళా కేంద్ర నిర్ణయం తో BRS పార్టీకి మరిన్ని ఓట్లు ..?

ఎన్నికల వేళా తెలంగాణా రైతులకి ప్రభుత్వం తరుపున అందించే నగదు త్వరలోనే చేరనుంది ,రైతుబంధు పథకం కింద నగదు బదిలీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కూడా  ఇచ్చేసింది ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.10,000 చొప్పున ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించిన నిధులు జమ చేసినప్పటికీ.. యాసంగి సీజన్ కోసం రెండో విడత నిధులు నవంబర్‌లోనే రైతులకు అందించాల్సి ఉంది. అయితే.. ఆలోగా ఎన్నికల కోడ్ రావడంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున నిధుల జమను ఆపేయాలని సూచించింది.

 

కాంగ్రెస్ అభ్యర్థనను తోసిపుచ్చిన ఈసీ.. యాసంగి సీజన్‌ కోసం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పంపిణీకి నవంబర్ 24న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించినా.. ఆ నిధులు ఇంకా జమ కాలేదు. శనివారం, ఆదివారం, సోమవారాలు వరుస సెలవుదినాలు కావడంతో 28న మంగళవారం రోజున నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాసంగి సీజన్‌ కోసం రైతులకు ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతుబంధు ఆర్థికసాయం పంపిణీకి అనుమతి లభించింది. ఈ నెల 28 లోపే దీన్ని పూర్తి చేయాలని ఈసీ ఆదేశించింది. దీనికి అనుగుణంగా శుక్రవారం రాత్రి భూపరిపాలన ప్రధాన కమిషనర్‌, వ్యవసాయ శాఖ కార్యాలయాలు ఈ-కుబేర్‌ పోర్టల్‌ ద్వారా రాష్ట్రంలో అర్హులైన 70 లక్షల మంది లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఆపై ఫైలును ఆర్థికశాఖకు పంపించారు.

 

దీనికి అనుగుణంగా ఆర్థికశాఖ రూ.7,700 కోట్లను ట్రెజరీల నుంచి నిధులను బ్యాంకులకు ట్రాన్స్‌ఫర్ చేయాలి. ఆ తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయి. శని, ఆది, సోమవారాలు సెలవు దినాలు కావడంతో ట్రెజరీలతో పాటు బ్యాంకులు పనిచేయడం లేదు. మంగళవారం మళ్లీ పనిదినం కావడంతో... ఆ రోజు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు.. ఈనెల 28న సాయంత్రం 5 గంటలలోపే అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

ఈ పధకం ద్వారా కొన్ని వేళా మంది రైతులు ఉపసాంత్వన  పొందుతున్నారు