ఓటుహక్కు వినియోగించుకోవడం లో ఆదర్శంగా నిలుస్తున్న సెలబ్రిటీలు ..!

ఓటు హక్కు వినియోగించుకోవడం లో సామాన్యులు వలే  సెలబ్రెటీలు కూడా క్యూలో నిలబడి ఓటువేసి ,ఓటుయొక్క గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు,తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైపోయింది. ఉదయం 7 గంటల నుంచే అన్ని పోలింగ్‌ బూత్‌లలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సామాన్య ప్రజలతో కలిసి క్యూలో నిలబడి తమ ఓటు వేస్తున్నారు. టాలీవుడ్‌ హీరోలు చిరంజీవి, వెంకటేష్‌, అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత అని ఎంతో మందికి ఈ విషయంలో స్ఫూర్తినిస్తున్నారు.