రేవంత్ మాటలు ప్రజల మనస్సుని హత్తుకుంటున్నాయి

రేవంత్ మాటలు ప్రజల మనస్సుని హత్తుకుంటున్నాయి  కొడంగల్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి 30 వేలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు రేవంత్. "ఆత్మగౌరవ జెండాను ఆకాశమంత ఎత్తున ఎగరేసిన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన ఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తా. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ జెండాను మోసిన ప్రతి కార్యకర్తను కడుపులో పెట్టుకుని చూసుకుంటా. ఈ గడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటా. దేశానికి కొడంగల్ ను ఒక మోడల్ గా నిలబెడతా." అని రాసుకొచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్.