వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల కొడుకు పెళ్లి ,ఎవరితోనో తెలుసా ?

జగనన్న వదిలిన బాణం ,వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగుతోంది. త్వరలో రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నారు. అక్కడ ప్రియా అట్లూరి అనే యువతీతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షర్మిల అనిల్ కుమార్ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.యువతి కమ్మ సామాజిక వర్గం. ప్రస్తుతం ఆమె అమెరికాలో ఉన్నారు. యూఎస్ఏ పౌరసత్వం సైతం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్త, చట్నీ సంస్థల అధినేత అట్లూరి విజయ వెంకట ప్రసాద్ మనవరాలే ప్రియా అట్లూరిగా తెలుస్తోంది. వైయస్ రాజారెడ్డి కి ప్రియా తో తొలిసారిగా చర్చిలో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా వారు ప్రేమలో ఉన్నారని పలు వార్తా కథనాల్లో పేర్కొన్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పెళ్లికి అంగీకరించారు.

 

రిద్దరి పెళ్లితో వయసుకు కుటుంబంలో మరో కులాంతర వివాహం జరిగినట్టే. వైయస్ షర్మిలది కూడా కులాంతర వివాహమే. ఆమె భర్త అనిల్ కుమార్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. కొద్దిరోజుల కిందటే రాజారెడ్డి అమెరికాలోని డలాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సును పూర్తి చేశారు. ఇడుపులపాయలు వైయస్ షర్మిల తనకున్న భూమిని కుమారుడు, కుమార్తె పేరిట ఈ ఏడాది జూలైలో రిజిస్ట్రేషన్ చేసిన సంఘటన తెలిసిందే. ఆ సమయంలోనే రాజారెడ్డి ఫోటోలు వైరల్ అయ్యాయి.తాజాగా సోషల్ మీడియాలో మరో ఫోటో వైరల్ అవుతుంది. త్వరలో వైయస్ కుటుంబంలోకి రాబోతున్న ప్రియా అట్లూరికి వైయస్ విజయమ్మ చీర పెడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. నేటిజనులకు తెగ ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే మరి కొద్ది నెలల్లో వైయస్ కుటుంబంలోకి ప్రియా అట్లూరి అడుగుపెట్టనున్నారు.అనే వార్తలు షికారు చేస్తున్నాయి అది ఎంతవరకు నిజమో తేలియాలిసివుంది