చిరంజీవి పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన మన్సూర్ అలీ

త్రిష గురించి వివాదాస్పద ఉక్యాలు చేసిన మన్సూర్ అలీ ,మెగాస్టార్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేసాడు ,ఇటీవల తమిళ ఇండస్ట్రీలో పుట్టుకొచ్చిన త్రిష, మన్సూర్ అలీఖాన్ వివాదం పై స్పందిస్తూ చిరంజీవి ట్వీట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ ట్వీట్ పై మన్సూర్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చిరంజీవి ట్వీట్ గురించి మాట్లాడుతూ.. మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ మన్సూర్ చేసిన ఆ కామెంట్స్ ఏంటి..?

 

“చిరంజీవి ప్రతి ఏడాది లేడీ హీరోయిన్స్ కి పార్టీలు ఇస్తుంటారు. ఆ పార్టీలకు నన్ను ఎప్పుడు పిలువలేదు అనుకోండి. ఆయన కేవలం హీరోయిన్స్ ని మాత్రమే పిలుస్తారు. అది ఆయన ఇష్టం. కానీ నాకు సంబంధించిన ఒక విషయం జరిగినప్పుడు.. అసలు ఏం జరిగిందని ఒకసారి కాల్ చేసి విషయం తెలుసుకొని ఉంటే బాగుండేది. అలా కాకుండా ఆయన మాట్లాడిన మాటలు బాధించాయి” అంటూ చెప్పుకొచ్చారు.

 

అలాగే చిరంజీవి పార్టీ పెట్టి కొన్ని వేల కోట్లు సంపాదించారని, కానీ పేద వాళ్ళకి ఒక్కరికి కూడా హెల్ప్ చేయలేదని వాపోయారు. చిరంజీవి, కుష్బూ, త్రిష మీద 20 కోట్లకు పరువు నష్టం దావా వేసినట్లు, వచ్చిన డబ్బును మధ్యం తాగి చనిపోయిన కుటుంబాలకు ఇస్తానంటూ ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.