మోనార్క్ ఇంత పని చేశాడా ?
ప్రకాష్ రాజ్ ఆర్థిక నేరాలకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు . తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జ్యువెలరీ గ్రూపుపై ఉన్న రూ.100 కోట్ల పోంజీ, మోసం కేసులో ప్రకాష్రాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆయనకు సమన్లు జారీ చేసి విచారించింది. ప్రణవ్ జ్యూయలర్స్కు ప్రకాష్రాజ్ అంబాసిడర్గా ఉన్నారు. పోలీసుల కథనం మేరకు ప్రణవ్ జ్యువెలర్స్, ఇతరులు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ స్కీం పేరుతో అధిక లాభాలు వస్తాయని ప్రజల నుంచి రూ.100 కోట్లు వసూలు చేశారని ఈడీ తెలిపింది. అయితే ఆ తర్వాత డబ్బును పెట్టుబడిదారులకు తిరిగి ఇవ్వడంలో ప్రణవ్ జ్యువెలర్స్ విఫలమయ్యింది. దీంతో తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్పై ఈడీ అధికారులు నవంబర్ 20న దాడులు నిర్వహించి రూ.23.70 లక్షల నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రకాష్రాజ్కు క్లీన్ చిట్ లభించింది. మనీలాండరింగ్ కేసులో ప్రకాష్రాజ్ ప్రమేయం లేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తెలిపింది. ఈ సమయంలో ప్రకాష్రాజ్ స్టేట్మెంట్ను రికార్డ్ చేయాలని ఈడీ కోరింది. కొన్ని ఉద్దేశపూర్వక చెల్లింపులు, ఇతర ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రకాష్రాజ్ను ప్రశ్నించాలని కోరుతూ ఈడీ గత నెలలో అతనికి సమన్లు జారీ చేసింది. ఈ సమయంలో తాజాగా ఆ జ్యూవెలరీ కంపెనీ మనీలాండరింగ్ కేసులో ప్రకాష్ రాజ్ ప్రమేయం లేదని.. ఆయన ఆ సంస్థకు కేవలం బ్రాండ్ అంబాసిడర్ మాత్రమేనని తెలిపింది. ఈ విషయాలను ఆన్లైన్ వేదికగా పంచుకున్న ప్రకాష్రాజ్... ‘‘తమిళం అర్థం కాని వారి కోసం.. తమిళనాడులోని ప్రణవ్ జ్యువెలర్స్ మోసంతో నాకు ఎలాంటి సంబంధం లేదని అధికారికంగా ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి నా వెంట నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సత్యమేవ జయతే’ అని పోస్ట్ చేశారు.
Comments
0 comment