నాకు ఫాన్స్ ముఖ్యం ,డబ్బులు కాదు అంటున్న బన్నీ

ప్రస్తుత పరిస్థితుల్లో డబ్భు సంపాదించందమే ద్యేయంగా  వున్నా ఈ రోజుల్లో , సినిమా ఇండస్ట్రీలో హీరోలైనా, హీరోయిన్లయినా వచ్చిన అవకాశాన్ని, తమకు నచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ కోట్లు సంపాదిలచాలని చూస్తుంటారు. సినిమాల్లో నటించడమే కాకుండా వ్యాపార ప్రకటనలతో కూడా డబ్బు సంపాదిస్తుంటారు. కొందరు స్టార్‌ హీరోలు కొన్ని బ్రాండ్లకు అంబాసిడర్స్‌గా ఉంటూ ఆ కంపెనీలను ప్రమోట్‌ చేస్తుంటారు. దానికి తగిన పారితోషికం అందుకుంటారు. వారిలో అల్లు అర్జున్‌ ఒకరు. సినిమాలతోపాటు కమర్షియల్‌ యాడ్స్‌ కూడా చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే కొన్ని రకాల వస్తువులను ప్రమోట్‌ చెయ్యకూడదనే రూల్‌ పెట్టుకున్నాడు బన్ని. అందుకే యాడ్స్‌ను సెలెక్టివ్‌గా చేస్తుంటాడు. తాజాగా ఓ కంపెనీ ఇచ్చిన రూ.10 కోట్ల ఆఫర్‌ను ఎంతో సునాయాసంగా తిరస్కరించాడు బన్ని. వివరాల్లోకి వెళితే.. పుష్ప చిత్రంలో అ అర్జున్‌ క్యారెక్టర్‌కి సంబంధించి మందు తాగే సన్నివేశాలు, గుట్కాలు తినే సన్నివేశాల్లో తమ బ్రాండ్‌ లోగోలను వినియోగించాలని, అలా చేస్తే రూ.10 కోట్లు రెమ్యునరేషన్‌ ఇస్తామని ఆఫర్‌ ఇచ్చారట. ప్రజలకు హాని చేసే వస్తువులను తాను ప్రమోట్‌ చేయనని ఆ కంపెనీకి చెప్పేశాడట బన్నీ. ఇప్పుడు బన్ని చేసిన పనిని అందరూ అప్రిషియేట్‌ చేస్తున్నారు. తమ హీరో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల అభిమానులు ఎంతో గర్వంగా ఫీల్‌ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. కొందరు హీరోలు పాన్‌ మసాలా యాడ్స్‌లో నటించి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలను విన్నాం. షారుఖ్‌, అక్షయ్‌ లాంటి హీరోలు కోర్టు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు.