ఎలక్షన్ ఓటింగ్ యంత్రాలు ఈవీఎం లు కరెక్ట్ గా పనిచేస్తాయా?సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

ప్రస్తుతం ఎలక్షన్స్ కాలం ,ఇటువంటి సమయం లో మనము బటన్  నొక్కే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు ఈవీఎం లు కరెక్టుగా పని చేస్తాయా ? (ఈవీఎంలు), ఓటరు వేరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్ (వీవీప్యాట్)‌ల విషయంలో దాఖలైన పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక నిర్ణయం వెలువరించింది. వీవీప్యాట్ల స్లిప్పులతో ఈవీఎంల్లో పోలైన 100 శాతం ఓట్లను సరిపోల్చాలని, బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేలా ఆదేశించాలన్న పిటిషనర్ల వాదనను తిరస్కరించింది. ప్రజాస్వామ్యం అనేది భిన్నమైన మూలస్తంభాల మధ్య సామరస్యం, విశ్వాసంతో కూడుకున్నదని ఈ సందర్భంగా జస్టిస్ట్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఫలితాల ప్రకటన తర్వాత ఇంజనీర్ల బృందంతో ఈవీఎంల మైక్రోకంట్రోలర్ ప్రోగ్రామ్‌ను తనిఖీ చేసేందుకు మాత్రం అనుమతించింది.ప్రజాస్వామ్యం అంటే సామరస్యాన్ని నెలకొల్పడానికి కృషి చేయడం.. ఎన్నికల ప్రక్రియపై గుడ్డిగా అపనమ్మకం పెంచుకోవడం అనవసర అనుమానాలకు దారి తీస్తుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ఒకే విధమైన అభిప్రాయం వ్యక్తం చేసినా.. కానీ వేర్వేరు తీర్పులను వెలువరించారు.సమతుల్య దృక్పథం ముఖ్యమైనది.. అయితే, ఒక వ్యవస్థను గుడ్డిగా అనుమానించడం అనవసరమైన అనుమానాలను పెంచుతుంది.. అందువల్ల, అర్థవంతమైన విమర్శ అవసరం.. అది న్యాయవ్యవస్థ, శాసనసభ మొదలైనవి కావచ్చు. ప్రజాస్వామ్యం అనేది అన్ని స్తంభాల మధ్య సామరస్యం, నమ్మకాన్ని కొనసాగించడం. విశ్వాసం, సహకార సంస్కృతిని పెంపొందించడం ద్వారా మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయవచ్చు’ జస్టిస్ దత్తా తన తీర్పులో పేర్కొన్నారు. అయితే, ఎన్నికల కమిషన్‌కు సుప్రీంకోర్టు రెండు ఆదేశాలు జారీ చేసింది.ఈవీఎంలో చిహ్నాలను లోడ్ చేసిన తర్వాత, సింబల్ లోడింగ్ యూనిట్‌ను సీలు చేసి కంటైనర్‌లలో భద్రపరచాలని సూచించింది. ‘అభ్యర్థులు, వారి ప్రతినిధులు సీల్‌పై సంతకం చేయాలి.. ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఎస్‌ఎల్‌యుల ఉన్న సీల్డ్ కంటైనర్‌లను ఈవీఎంలతో పాటు స్టోర్‌రూమ్‌లలో ఉంచాలి’ అని కోర్టు తెలిపింది.